బిఎంఎస్ వ్య‌వ‌స్థాప‌కుడికి పోస్ట‌ల్ శాఖ అరుదైన గౌర‌వం – జ‌యంతి వేళ‌ ద‌త్తోపంత్ థేంగ్డే ముఖ‌చిత్రంతో రూ.5 స్టాంప్ ఆవిష్క‌ర‌ణ‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌తీయ మ‌జ్ధూర్ సంఘ్ (బిఎంయస్) వ్య‌వ‌స్థాప‌కులు దివంగ‌త‌ దత్తోపంత్ థేంగ్డేను ఇండ‌య‌న్ పోస్ట‌ల్ శాఖ‌ అరుదైన‌ గౌర‌వంతో స్మ‌రించుకుంది. వారి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని దత్తోపంత్ థేంగ్డే ముఖచిత్రంతో రూపొందించిన రూ.5 విలువైన‌ స్టాంప్‌ను తెలంగాణ పోస్ట‌ల్ శాఖ ఆవిష్క‌రించింది. తెలంగాణ పోస్ట‌ల్ సర్కిల్ పీఎంజీ సుబ్రమణ్యం, బింఎంఎస్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బి.రవీంద్రరాజు వర్మలు న‌గ‌రంలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో దత్తోపంత్ థేంగ్డే స్టాంపును విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక లోకాన్నిజాగృతి ప‌రిచి వారి క‌ష్టల‌ను క‌డ‌తేర్చ‌డంలో ద‌త్తోపంత్ థేంగ్డే చేసిన కృషి మ‌రువ‌లేనిద‌ని అన్నారు. నేటిత‌రం కార్మిక నాయ‌కులు వారిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఎంఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు రవిశంకర్ అల్లూరి, పోస్టల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సర్కిల్ సెక్రెటరీ ఎస్ఏ బేగ్, పి.లక్ష్మీనారాయణ, వెంకట్ రెడ్డి, జయచంద్ తదితరులు పాల్గొన్నారు.

స్టాంప్‌ను ఆవిష్క‌రిస్తున్న‌ తెలంగాణ పోస్ట‌ల్ సర్కిల్ పీఎంజీ సుబ్రమణ్యం, బింఎంఎస్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బి.రవీంద్రరాజు త‌దిత‌రులు
పోస్ట‌ల్ శాఖ ఆవిష్క‌రించిన బిఎంఎస్ వ్య‌వ‌స్థాప‌కుడు ద‌త్తోపంత్ థేంగ్డే ముఖ‌చిత్రంతో కూడిన‌ రూ.5 స్టాంప్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here