బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ నాయకులను గెలిపించుకుందాం

  • బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి : రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ నాయకులను గెలిపించుకోవాల్సిందిగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు తమ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని, అందుకు తగిన విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ నాయకులను ఓటు వేసి గెలిపించుకుంటేనే రాజకీయ అధికారం దక్కుతుందన్నారు. రాజ్యాధికారం వల్ల భావితరాల భవిష్యత్తు, అందాల్సిన పథకాలు అన్ని సకాలంలో అందుతాయన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here