- నివాళులర్పించిన రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్
నమస్తే శేరిలింగంపల్లి : ఆరంభ టౌన్షిప్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆ మహానియుడికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం భారతదేశానికి అందించారని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేద్దామన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-14-at-1.16.58-PM-2.jpeg)
ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్ర రాథోడ్, మధుసూదన్ రెడ్డి, రాజేష్, డాక్టర్ పసునూరి రవీందర్, లక్ష్మయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు సూర్యా రాథోడ్, జనార్ధన్, విక్రమ్ యాదవ్, సాయిరాం, తిమ్ముతి, కేఆర్ కే రాజు, శరణప్ప, అరుణ శ్రీ, దాసరి సరిత, శ్వేత, మానస పాల్గొన్నారు.