అన్నమయ్యపురంలో మైమరిపించిన ‘శ్రీ మయూరి’ నృత్యార్చన

నమస్తే శేరిలింగంపల్లి : అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో అన్నమ స్వరార్చన మరియు నృత్యార్చన ఆకట్టుకున్నది. అంతకుముందు శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి తొలుత శోభా రాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతితో ప్రారంభించారు.

నృత్యార్చనలో కళాకారులు

అనంతరం శ్రీ మయూరి నృత్యాలయ గురువు రాజనాల శ్రీదేవి రామ్ కుమార్, వారి శిష్య బృందం తమ నృత్య ప్రదర్శనతో అందరిని అలరించారు. ఇందులో భాగంగా, “గణేశ పంచరత్న కీర్తన, హిమగిరి తనయే హేమలతే, అతి నిరుపమ సుందరాకర, శరణు శరణు సురేంద్ర, కృష్ణం కలయ సఖి సుందరం, దశావతార శబ్దం, ఇదిగో భద్రాద్రి, అదివో అల్లదిహో” అనే సంకీర్తనలను ప్రదర్శించారు. తదనంతరం కళాకారులను సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. చివరిగా అన్నమయ్య సమేత వేంకటేశ్వర స్వామికి అంగనలీరే మంగళ హారతి ఇచ్చి పసందైన ప్రసాద వితరణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here