అలరించిన కూచిపూడి, భరత నాట్య నృత్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళాకు విశేష ఆదరణ లభిస్తున్నది. వివిధ రాష్ట్రాలకి చెందిన చేనేత హస్త కళా ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేతకు హస్త కళాకారులకి చేయూతనిస్తున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో కాకినాడ నుండి విచ్చేసిన నాట్యాచార్యులు డాక్టర్ కృష్ణ కుమార్ శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ అవార్దీ ఆనంద శంకర్ జయంత్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.

చేనేత వస్తువులను కొనుగోలు చేస్తున్న మహిళలు
నృత్య ప్రదర్శనలో కళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here