డివిజన్ అభివృద్దికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతాం

  • ఆదిత్య నగర్ బస్తీ పర్యటనలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శే రిలింగంపల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోనే మాదాపూర్ డివిజన్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

పాదయాత్రలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని, డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు . మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ బస్తీలో పర్యటించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను బస్తి నాయకులను అడిగి తెలుసుకున్నారు అనంతరం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ బస్తి అధ్యక్షులు మునఫ్ ఖాన్, మాదాపూర్ మైనారిటీ అధ్యక్షులు రహీం, నాయకులు ఖాసీం, లియకత్, సలీం, బాబూమియా, అజీమ్, యూత్ అధ్యక్షులు ఖాజా, జి.హెచ్.ఎం.సి ఏ.ఈ ప్రశాంత్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here