నమస్తే శేరిలింగంపల్లి : గత నాలుగు సంవత్సరాలు నుంచి కరోనా కారణంగా మధ్యతరగతి ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని హఫీజ్ పేట్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అనూష మహేష్ యాదవ్ అన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-12-at-2.47.47-PM.jpeg)
జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఆస్తి పన్నుపై వడ్డీ ని పూర్తిగా మాఫీ చేయవలసిందిగా కోరుతూ జిహెచ్ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా కోరారు.