- శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఆరు గ్యారంటీల అమలుపై శేరిలింగంపల్లి నియోజకవర్గ అధికారులతో ఆ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ సమీక్ష నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి, ప్రతి గడపకు అభివృద్ధే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేసిందని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఎన్నిలలో ప్రకటించిన పథకాలు అమలు చేయడానికి శ్రీకారం చుటిందని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేపటినుంచి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.