అభివృద్ధి, పలు సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన

  • చీఫ్ సిటీ ప్లానర్( సీసీపీ) దేవేందర్ రెడ్డి ని కలిసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీ ప్లానర్( సీసీపీ) దేవేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింక్ రోడ్డుల అభివృద్ధి, పలు సమస్యల పై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చర్చించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఎల్లమ్మ బండ 132 కెవి లైన్ రోడ్డు కోర్ట్ కేస్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు రోడ్డు సౌకర్యం కలిపించాలని, మోర్ సూపర్ మార్కెట్ వద్ద, నిజాంపేట్ సర్వే నెంబర్ 172 డబుల్ రోడ్డు (హై టెన్షన్ లైన్ రోడ్డు) కొలన్ రాఘవ రెడ్డి గార్డెన్ నుండి సర్వే నెంబర్ 172 మియాపూర్ 60 ఫీట్ రోడ్డు, ఆస్ బెస్టాస్ కాలనీ రివైజ్డ్ లే ఔట్ వద్ద , గోపి చెరువు TDR వద్ద ఎల్లమ్మ చెరువు TDR వద్ద లింక్ రోడ్డు, చెరువుల TDR లు , ఆస్ బెస్టాస్ కాలనీ రివైజ్డ్ లే ఔట్ వంటి సమస్యలను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ రహిత సమాజం కోసం ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని సీసీపీ దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు , దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని, వెంటనే పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని, సకాలంలో లింక్ రోడ్లు పూర్తి అయ్యేలా చూస్తామని చెప్పారని తెలిపారు.

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో చీఫ్ సిటీ ప్లానర్( సీసీపీ) దేవేందర్ రెడ్డి తో అభివృద్ధి పనులపై చర్చిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here