ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: భవానీ శంకర్ నగర్ కాలనిలో 100 కేవి ట్రాన్స్ ఫార్మర్ ను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించడం జరిగిందని..గతంలో నీరు లేక క్రాప్ హల్ డే, పరిశ్రమలకు పవర్ హల్ డేలు ఉండేవి. కాని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు, పరిశ్రమలకు ఇరవైనాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

భవానీ శంకర్ నగర్ కాలనిలో 100 కేవి ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభిస్తున్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు వరలక్ష్మి, భవాని శంకర్ నగర్ కాలనీ అధ్యక్షులు రమేష్, అసోషియషన్ సభ్యులు రాజన్న, సివి రమేష్, శ్రీనివాస్ చారి పాల్గొన్నారు.

కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కి సన్మానం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here