శేరిలింగంపల్లి, మే 5 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 10వ తేదీన హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా ఆయన సభకు భారీ ఎత్తున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని బిజెపి సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, గణేష్, లక్ష్మణ్, రఘు పిలుపునిచ్చారు. దేశ ప్రధాని అయ్యాక మూడోసారి రాష్ట్రానికి రాబోతున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలకవలసిందిగా ప్రజలను, కార్యకర్తలను కోరారు.






