శేరిలింగంపల్లి, జనవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని పలు ప్రాంతాల్లో గురువారం నిర్వహించనున్న మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని హైదర్నగర్ ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 33/11 కేవీ మయూరి నగర్ సబ్ స్టేషన్ 11కేవీ గోకరాజు రంగరాజు ఫీడర్ పరిధిలో ఉన్న గోకరాజు రోడ్డు, ఆర్ఎల్ సిటీ రోడ్డు, వెంకటరాయ నగర్, బాలాజీనగర్, ఇందిరమ్మ కాలనీ, మయూరినగర్ పార్ట్ ప్రాంతాల్లో కరెంటు ఉండదని తెలిపారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11కేవీ లక్ష్మీ నగర్ ఫీడర్ పరిధిలోని లక్ష్మీనగర్, దోవా కాలనీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రోడ్డు, నమహా అపార్ట్మెంట్స్, బుద్ధ అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లో కరెంటు ఉండదని అన్నారు. వినియోగదారులు విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.





