మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస మ్యానిఫెస్టోలో జంట నగర ప్రజలకు ఉచిత మంచినీళ్లు ప్రకటించిన సందర్భంగా న్యూ పీఏ నగర్ లో తెరాస సీనియర్ నాయకుడు వీవై రమేష్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులు మారుతి రావు, వీఆర్ రమేష్, విఠలాచారి, అంకమ్మరావు, కె.దశరథ్, ప్రభాకర్, బొల్ల గిరిజ, సుగుణమ్మ, శంకర్ పాల్గొన్నారు.






