శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ గౌతమి నగర్ కాలనీలో ఉన్న స్థానిక మున్సిపల్ పార్కులో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి వాటిని ఒక్క చోట చేర్చి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు.






