మియాపూర్‌లో ఘ‌నంగా అమ్మ‌వారి పూజ‌లు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని దత్త సాయి నగర్ కాలనీ, న్యూ కాలనీ, ముజ‌ఫర్ అహ్మ‌ద్ న‌గర్ కాలనీలలో దసరా పర్వదినం సందర్భంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 7వ రోజు శ్రీ సరస్వతీ దేవి అవతారంలో విశేష అలంకరణలో పూజలు అందుకుంటున్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపాలలో జరిగిన పూజ కార్యక్రమాలలో స్థానిక నాయకులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కబీర్ కౌశల్, విజయ్, రాములు, రాజు గౌడ్, శివ ముదిరాజ్, అవినాష్, అనిల్, గౌతం, ప్రకాష్ గౌడ్, గోపాల్ గౌడ్, తిరుపతి, చందు, తిమ్మరాజు, శంకర్, గిరి, లక్ష్మణ్, టిల్లు, వెంకట్, నరేష్, ఈశ్వర్, గిరి బాబు, సాయి, రాజేష్, సత్య గౌడ్, రంగనాథ్, మారుతి, శేషి కుమార్, దినేష్ కాలనీల వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అమ్మ‌వారికి పూజ‌లు చేసిన కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here