ఘనంగా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ జయ దుర్గ మైసమ్మ దేవస్థానంలో నిర్వహిస్తున్న దసరా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నియోజకవర్గ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కూన సత్యం గౌడ్, నియోజకవర్గ నాయకులు మన్నెపల్లి సాంబశివరావు, కావూరి ప్రసాద్, రాజిరెడ్డి, లక్ష్మీ నారాయణ, వాసు, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పూజ‌ల్లో పాల్గొన్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here