అభివృద్ధే ల‌క్ష్యంగా ముందుకు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని శేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్ల అభివృద్ధిలో భాగంగా రూ.5.10 కోట్ల‌ అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం, లింక్ రోడ్డు నిర్మాణం, బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల, సెంట్రల్ పార్క్ ఫేస్ 1, సెంట్రల్ పార్క్ ఫేస్ 2 కాలనీలలో రూ.1 కోటి 95 లక్షల 25 వేల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్లు, లింక్ రోడ్డు, ప్రహరీ గోడ నిర్మాణం పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నామ‌ని అన్నారు. కాలనీలు, బ‌స్తీల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం చిత్త శుద్ధితో ప‌నిచేస్తుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here