నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఆదివారం మియపూర్ మయూరి నగర్ కాలనీలో గుడ్ డీడ్, రేజోల్యూషన్ యునైటెడ్ సంయుక్తంగా రన్ ఫర్ హెల్త్, 5కే రన్ ఫర్ హెల్ప్ చైల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం రన్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతుంటారని, అందువల్ల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నారాయణ రావు, నాయకులు, కావూరి ప్రసాద్, మధుసూదన్ రావు, కొఠారి వెంకటేష్, మనేపల్లి సాంబశివరావు, కిషోర్, రంగారావు, సాంబశివరావు, రమేష్, కృష్ణ మూర్తి ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.