నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ ఆటో స్టాండ్ సమీపంలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ 6వ ప్లాట్ఫారమ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దాదాపు 50 నుంచి 55 ఏండ్ల వయస్సు ఉండవచ్చని, భిక్షాటన చేస్తూ ఉండేవాడని తెలిసింది.
అనారోగ్య కారణాల వల్ల చనిపోవచ్చని, ఇతర వివరాలు తెలియలేదని చందానగర్ పోలీసులు చెప్పారు. అతని ఆచూకీ తెలిసిన వారు చందానగర్ పిఎస్ లో (8008029073, 8712566921) సంప్రదించాలని తెలిపారు.