అంగరంగ వైభవంగా వేంకటేశ్వరస్వామి కళ్యాణమహోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత వేంకటేశ్వరస్వామి దేవాలయంలో భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీవారి కల్యాణాన్ని తిలకించారు. ఆలయ పూజారులు వేదం మంత్రోచ్ఛరణల నడుమ కళ్యాణం నిర్వహించగా.. ఆలయానికి వచ్చిన భక్తులతో ఆ ప్రాంత పరిసరాలు కిటకిటలాడాయి. తదనంతరం భక్తులకు హారతి తీర్థ ప్రసాదములు అందజేసి అన్నప్రసాధ వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here