నిర్లక్ష్యంగా బైక్ రైడింగ్ చేస్తూ డివైడర్ ను ఢీ కొట్టిన యువకుడు

చికిత్స పొందుతూ మృతి

ప్రమాదం అనంతరం పవన్ కళ్యాణ్ ను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం

మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి) అతివేగంతో నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాన్ని నడిపిన యువకుడు డివైడర్ ను ఢీకొట్టిన ఘటనలో తీవ్ర గాయాలపాలై మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోరబండ ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన దారంగుల పవన్ కళ్యాణ్( 21) స్థానికంగా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శుక్రవారం ఉదయం పవన్ కళ్యాణ్ తన ద్విచక్రవాహనంపై పర్వత్ నగర్ క్రాస్ రోడ్ నుండి మాదాపూర్ వైపుగా అల్పాహారం చేసేందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే అతివేగంతో నిర్లక్ష్యంగా బైకు నడపడంతో మాదాపూర్ రెట్రో కార్ షోరూమ్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ కు తీవ్ర గాయాలు కాగా రక్తస్రావం జరగడంతో స్థానికంగా గల ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం పవన్ కళ్యాణ్ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here