సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఆసరా- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల కుటుంబాలకు అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీ లో ఒకే కుటుంబానికి చెందిన టి.లహరి, టి.రోహిత్ లకు అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 4 లక్షల ఎల్ ఓ సీ మంజూరు పత్రాన్ని మాజీ కార్పొరేటర్ రంగారావుతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల కోసం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని అన్నారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సీ పత్రాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here