దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తాం – కొండాపూర్ ‌కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టి కొండాపూర్ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ నుండి సఫారీ నగర్, కొత్తగూడ వరకు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన యూజీడీ పనులను, రూ. 15 లక్షలతో చేపట్టిన రంగన్న గుంట చెరువు సుందరీకరణ పనులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక వసతుల పై దృష్టి పెట్టి పనులను చేస్తున్నామని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తూ, రోడ్లను వేస్తూ, మంచి నీటి లైన్లను ప్రతి ఇంటికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చెరువులను అభివృద్ధి చేస్తూ, వాటి సుందరీకరణ పనులను వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహకారంతో కొండాపూర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగం గౌడ్, ఊట్ల దశరథ్, అశోక్ సాగర్, సాయి శామ్యూల్ కుమార్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

కొండాపూర్ డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ‌కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here