యూత్ కాంగ్రెస్ శేరిలింగంపల్లి అసెంబ్లీ అధ్యక్షునిగా సౌందర్య రాజన్

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ యువజన విభాగం శేరిలింగంపల్లి అసెంబ్లీ అధ్యక్షునిగా సౌందర్య రాజన్ నియామ‌కం‌ అయ్యారు. కాంగ్రెస్ యువజ‌న రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి చేతుల మీదుగా సౌందర్య రాజన్ నియామకపు పత్రాన్ని అందుకు‌న్నారు.‌ సౌందర్య రాజన్ మాట్లాడుతూ ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తామన్నారు. యువజన‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో‌ మరిన్ని కార్యక్రమాలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ యువజన‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, గోపి రామర్తి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి గౌడ్, దుర్గేష్, మందుల సైదులు ఖాజా, ముషరాఫ్ హరికిషన్, శామ్యూల్, రాజేష్, పీటర్, రాజేష్ గౌడ్, హన్మంత్, సలీమ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్టి‌‌ చేతుల మీదుగా నియామకపు పత్రాన్ని అందుకుంటున్న సౌందర్య రాజన్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here