గచ్చిబౌలి లో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి‌

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి కార్పొరేటర్ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జిల్లా, సీనియర్ నాయకులు,‌ డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలోనూ బ్రిటిషర్లపై పోరాడుదామని పిలుపునిచ్చిన గొప్ప నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటీషర్లపై వీర పోరాటం చేసి నేతాజీగా కీర్తిగడించిన భారత స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. యువతకు మార్గదర్శి, భవితకు దిక్సూచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, తిరుపతి, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్, గోపనపల్లి వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు, హరీష్, శంకర్ యాదవ్, కిషన్ గౌలి, ప్రసాద్, ప్రకాష్, దుర్గారామ్, మన్నే రమేష్, విజయ్ బాసనీ, గంగాధర్, రాజు, శ్రీను, నరేందర్, గోరఖ్, గుండప్ప, నరేష్, విష్ణు, శ్రీకాంత్, వెంకటేష్, సాయి, శివ కుమార్, నర్సింగ్ రావు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

గౌలిదొడ్డి వార్డు కార్యాలయంలో సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here