బాలరాజు యాదవ్ కు అఖిల భారత యాదవ మహాసభ సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ఫిష్, గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను శనివారం అఖిల భారత యాదవ మహాసభ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బేరి రాంచందర్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నడికూడ రఘునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ సంఘం నాయకులు దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి అలుపెరగని పోరాటం చేసిన యాదవ ముద్దు బిడ్డకు ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేటెడ్ ఫోస్టు కట్టబెట్టడం గర్వంగా ఉందన్నారు. యాదవుల అభివృద్ధికి తన వంతుగా కృషి చేయాలని బాలరాజు యాదవ్ ను కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ్, మహేష్ యాదవ్, అందెల సత్యనారాయణ యాదవ్, రాజు యాదవ్, వెంకటేష్ యాదవ్, కొడకంచి శ్రీశైలం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

బాలరాజ్ యాదవ్ ను సన్మానిస్తున్న అఖిల భారత యాదవ మహాసభ‌ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here