నమస్తే శేరిలింగంపల్లి: దసరా ఉత్సవాలను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, అమ్మవారి చల్లని చూపులు ప్రజలందరిపై ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆకాంక్షించారు. ఖాజాగూడలోని సాయి ఐశ్వర్య లే అవుట్ లో కొమిరిశెట్టి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు దుర్గాదేవిగా అలంకరింపబడి భక్తులకు దర్శనమిచ్చారు. కొమిరిశెట్టి కుటుంబం ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వారి కుటుంబానికి అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఆయన వెంట గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, కొమిరిశెట్టి ఫౌండేషన్ మెంబర్ వేణు, మాదాపూర్ డివిజన్ ఎర్ర గుడ్ల శ్రీనివాస్, నాయకులు జగదీష్, రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.