నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీ సెంటర్ లో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో బిజెపి ఓబిసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నారు. కమిటీ నిర్వాహకులు మహేష్ యాదవ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, బిక్షపతి, కృష్ణ , సుదర్శన్, నరసింహ, సాయి చరణ్, పవన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.