గౌతమి నగర్ శ్రీ లలితా పోచమ్మ ఆలయంలో కుంకుమార్చనలు – జమ్మివృక్షాన్ని నాటిన కార్పొరేటర్ మంజుల రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ గౌతమి నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు అమ్మవారు బాలాత్రిపురసుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దేవాలయంలో లలితాసాహస్ర నామ కుంకుమార్చనలో 150 మంది మహిళాభక్తులు పాల్గొని భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.వైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి జమ్మి శమీవృక్షాన్ని నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఆలయ కమిటీ నిర్వాహకులు గుర్రపు రవీందర్ రావు,గుర్రపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ శ్రీ లలితాపోచమ్మ ఆలయంలో జమ్మిచెట్టును నాటుతున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here