శేరిలింగంపల్లిలో ఘనంగా శ్రీదేవీ శరన్నవరాత్రులు ప్రారంభం – వాడవాడలా వివిధ రూపాల్లో కనువిందు చేసిన అమ్మవార్లు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు ఆలయాల్లో, కాలనీలలో, అపార్ట్ మెంట్లల్లో దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మండపాలను, ఆలయాలను విద్యుత్ దీపాలంకరణలతో సర్వాంగసుందరంగా నిర్వాహకులు తీర్చిదిద్దారు. మొదటి రోజున చాలాచోట్ల అమ్మవారిని బాలా త్రిపురసుందరి దేవిగా అలంకరించగా, పలుచోట్ల ప్రత్యేక అవతారాల్లో పూజించారు. కరోనా ఉదృతి తర్వాత జరుగుతున్న ఉత్సవాల నేపథ్యంలో భక్తుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది.

శిల్పాఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ బాలాత్రిపురసుందరి దేవి సంపూర్ణ అలంకరణలో కనువిందు చేస్తున్న అమ్మవారు.
అన్నపూర్ణ ఎంక్లేవ్ లో శ్రీ బాలాత్రిపురసుందరి దేవికి పూజలు చేస్తున్న విగ్రహదాత గున్నా జైపాల్ రెడ్డి, శోభ దంపతులు
గంగారం గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నిజ స్వరూప పర్వత వర్దిని దేవి అలంకరణలో అమ్మవారు
శేరిలింగంపల్లి ఆదర్శనగర్ ఓంకార జ్యోతిష్యాలయంలో బ్రహ్మశ్రీ విశ్వనాధుల చంద్రశేఖర శాస్త్రి ఆధ్వర్యంలో దేవి నవరాత్రోత్సవాల్లో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు
వేముకుంటలోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here