నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు ఆలయాల్లో, కాలనీలలో, అపార్ట్ మెంట్లల్లో దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మండపాలను, ఆలయాలను విద్యుత్ దీపాలంకరణలతో సర్వాంగసుందరంగా నిర్వాహకులు తీర్చిదిద్దారు. మొదటి రోజున చాలాచోట్ల అమ్మవారిని బాలా త్రిపురసుందరి దేవిగా అలంకరించగా, పలుచోట్ల ప్రత్యేక అవతారాల్లో పూజించారు. కరోనా ఉదృతి తర్వాత జరుగుతున్న ఉత్సవాల నేపథ్యంలో భక్తుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది.