దొడ్ల మిల్క్ బూత్ ను ప్రారంభించిన బిజెపి నేత గుండె గణేష్ ముదిరాజ్

నమస్తే శేరిలింగంపల్లి: హెచ్ఎంటి స్వర్ణపురి-పీఏనగర్ ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటుచేసిన దొడ్ల మిల్క్ బూత్ ను మియాపూర్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకుడు గుండె గణేష్ ముదిరాజ్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు ఉద్యోగం దొరకడం లేదని బాధపడరని, స్వశక్తితో ఎదిగడానికి కృషి చేస్తారని అన్నారు. ఈ క్రమంలోనే సొంతంగా పాల వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న నిర్వాహకుడు వెంకటేశ్వర్లును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నిరుద్యోగ యువకులు వెంకటేశ్వర్లు లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాజేరావు శ్రీను, రేపన్ వెంకటేష్, జాజేరావు రాము, శ్రీధర్, రాజేందర్, దుర్గేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మిల్క్ బూత్ ను ప్రారంభిస్తున్న గుండె గణేష్ ముదిరాజ్ తో నిర్వాహకుడు వెంకటేశ్వర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here