రూ.13.67 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం దరఖాస్తు చేసుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 13.67 లక్షల చెక్కులను సోమవారం ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రుల్లో వైద్య ఖర్చులు భారమైన పేదకుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రంగారావు, టీఆర్ఎస్ కూకట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు సాంబశివరావు, బ్రిక్ శ్రీను, కాశీనాథ్ యాదవ్, శ్రీనివాస్ చౌదరి, రఘునాథ్, వాసుదేవరావు, వెంకట్ నాయక్, సంగమేష్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here