ప్రభుత్వ విప్ గాంధీ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న ముగ్గురు బాధితులకు ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 1.21 లక్షల చెక్కులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని చెప్పారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, నాయి నేని చంద్రకాంత్ రావు, నరేష్, జగదీష్, యాదగిరి తదితరులు పాల్గొనారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here