- జెండా ఊపి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని తారానగర్ తుల్జభవాని అమ్మవారి ఆలయం నుండి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం వరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆరెకపూడి గాంధీ విజయం సాధించినందుకు వి. శ్రీనివాస్ సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ యాత్రను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. అంతకముందు తుల్జభవాని అమ్మవారి ఆలయంలో కార్పొరేటర్ సమక్షంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-12-at-12.44.27-PM-scaled.jpeg)
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, కటిక రాంచందర్, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, వార్డ్ మెంబర్ కవిత గోపాల కృష్ణ, పాండు ముదిరాజ్, డా. రవి కుమార్, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ రాథోడ్, నూకల సంపత్, నారాయణ, బుచ్చయ్య, మురళి, పవన్, భీమని శ్రీను, మహేష్, సాయి నందన్, జమ్మయ్య, శ్యామ్, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-12-at-12.44.28-PM-scaled.jpeg)