ప్రజలందరికి సుపరిపాలన అందించేందుకు నిరంతరం కృషి : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలందరికి సుపరిపాలన అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు.

వార్డు కార్యాలయం ప్రారంభోత్సవంలో..

పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికై, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమి నగర్ లో నూతన వార్డ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలనలో భాగంగా ప్రతి వార్డులో వార్డు కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ వార్డు కార్యాలయంలో పది విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటారని, సమస్యలు ఏవైనా అధికారులు వెంటనే స్పందించి పరిష్కారిస్తారని తెలిపారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఅర్ఏస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here