పోలింగ్ సరళి పరిశీలన

  • ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గాంధీ పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి : ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందని, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నేను కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా ప్రజలు పోలింగ్ లో పాల్గొంటున్నట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here