వైద్య సిబ్బంది నిర్లక్షంపై గోపినగర్ మహిళల మండిపాటు

జనావాసాల నడుమ వదిలేసిన కోవిడ్ నిర్ధారణ పరీక్ష కోసం ఉపయోగించిన వైద్య పరికరాలు

-కోవిడ్ పరీక్ష కోసం ఉపయోగించిన పరికరాలను జనావాసాల నడుమ పారేసిన సిబ్బంది

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పై గోపినగర్ వాసులు మండిపడుతున్నారు. శేరిలింగంపల్లి డివిజన్ గోపినగర్ లోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో సోమవారం కోవిడ్ 19 నిర్ధారణ కొరకు స్థానిక వైద్య సిబ్బంది రాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించారు. స్థానికంగా గోపినగర్, బాపు నగర్, నెహ్రూ నగర్ లకు చెందిన అనుమానితులు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయించుకున్నారు. మధ్యాహ్నం వరకు కొనసాగిన పరీక్షల అనంతరం అక్కడ ఉపయోగించిన మాస్కులు గ్లౌజులు అదేవిధంగా కోవిడ్ నిర్ధారణ కోసం ఉపయోగించే ప్రత్యేక వైద్య పరికరాలను సమీపంలోని నివాసాల నడుమ పారవేశారు. తాము అడ్డుపడిన వైద్య సిబ్బంది వినిపించుకోలేదు అంటూ స్థానిక మహిళలు మండిపడుతున్నారు. ఒక వైపు కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో వైద్య పరీక్షల కోసం ఉపయోగించిన పరికరాలను నిర్లక్ష్యంగా పారేయడం సరికాదని, వెంటనే వాటిని తొలగించి, పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here