తంగరాజు బస్తీలో కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బస్తీ బాట

తంగరాజు బస్తిలో పర్యటిస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ లోని తంగరాజు బస్తీలో కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సోమవారం 11వ రోజు బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలో కలియ తిరుగుతూ స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు కాలనీవాసులు కాలనీలో డ్రైనేజీ పనులు పెండింగ్ లో ఉన్నాయని, కాలనీ ప్రారంభంలో వేసిన డ్రైనేజీ లైన్ల కావడం వల్ల తరచూ పొంగుతున్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్పందించి కార్పొరేటర్ ఇప్పటికే కాలనీలో 90% వరకు అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మిగిలిన కొద్దిపాటి పెండింగ్ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లో యువ నాయకులు రామకృష్ణ గౌడ్ ,వార్డు సభ్యులు కాశీనాథ్ యాదవ్, నాయకులు బోయ కిషన్, రాజేంద్ర, వాసు, మహేష్, ముజీబ్ ,కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు వెంకటేష్, లింగయ్య, రమేష్_ ఆనంద్ బాల్ రాజు, రాజు ఆంజనేయులు తదితరులు ఉన్నారు.

కార్పొరేటర్ దొడ్డి వెంకటేష్ గౌడ్ కు స్థానిక సమస్యలను వివరిస్తున్న తంగరాజు బస్తీవాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here