గోపన్ పల్లిలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

నమస్తే శేరిలింగంపల్లి: ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శాంతలోలు యాదయ్య(45) తన కుటుంబ సభ్యులతో కలిసి గోపన్ పల్లిలో నివసిస్తున్నారు. అయితే కొద్దీ రోజులుగా ఇంటిని అమ్మే విషయమై తన భార్య, కుమార్తెతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం యాదయ్య తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై తన అన్న కొడుకు శాంతలోలు మైసయ్య చందానగర్ పోలీసులకు సమాచారం అందించాడు. తన బాబాయ్ మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here