- మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ మహానగర అభివృద్ధి విషయంలో బల్దియా ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జిహెచ్ఎంసి పలు శాఖల సంబంధిత అధికారులు, స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలసి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. చెరువుల సంరక్షణ ప్రజల సౌకర్యాలు ఎస్ఆర్డీపీ సహా ఇతర అభివృద్ధి పనుల విషయంలో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని వాటిపై సమీక్షించి జాప్యం లేకుండా ఆమోదించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిహెచ్ఎంసి పలు శాఖల సంబంధిత అధికారులు, బల్దియా స్టాండింగ్ కౌన్సిల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.