కొనసాగుతున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మయూరి డాన్స్ అకాడమీ గురువర్యులు వైదేహి సుభాష్ శిష్య బృందం చేసిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. పుష్పాంజలి, మల్లారి, కౌతం, అంబ స్తుతి, జతిస్వరం, పదం, తిల్లాన అంశాలను ప్రదర్శించారు. గురువు వైదేహి, గాయత్రీ, సాత్విక, శుభశ్రీ,రితిక, అంగ, మాళవిక మొదలైన వారు చక్కని ప్రదర్శన ఇచ్చారు.

భరతనాట్య ప్రదర్శనలో కళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here