అభివృద్ధికి మెచ్చి.. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై.. బీఆర్ఎస్ లోకి..

  • బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న దొంతి రాధా సత్యం గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. ఆ పార్టీ చేపడుతున్న అభివృద్ధికి మెచ్చి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతూ మద్దతు తెలుపుతున్నారు.

పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్న చేవెల్ల ఎం.పీ. రంజిత్ రెడ్డి

రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధిలో మేము సైతం పాలు పంచుకుంటామంటూ ముందుకువస్తున్నారు. తాజాగా చందానగర్ డివిజన్ క్రిస్టల్ గార్డెన్స్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పొరెటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో చేవెల్ల ఎం.పీ. రంజిత్ రెడ్డి చేతులమీదగా దొంతి రాధా సత్యం గౌడ్ (అమ్మ) పార్టీ కండువా కప్పుకొని బి.ఆర్.ఎస్. పార్టీ తీర్దం పుచ్చుకున్నారు. ఆమెతోపాటు సుగుణ, గోవిందమ్మ, సునీత, అనిత, కమల, పార్టీలో చేరారు. డివిజన్ యూత్ అధ్యక్షుడు దొంతి కార్తిక్ గౌడ్ పాల్గొన్నారు.

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా పార్టీలో చేరివారితో చేవెల్ల ఎం.పీ. రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here