శేరిలింగంప‌ల్లిని ముంచెత్తిన వ‌ర‌ద‌

పూర్తిగా నీట మునిగిన లింగంప‌‌ల్లి రైల్వే అండ‌ర్‌ బ్రిడ్జీ. జోరుగా పారుతున్న వ‌ర‌ద‌నీటిలో చేప‌లు ప‌డుతున్న జాల‌ర్లు

– చెరువుల‌కు గండి – నీట మునిగిన కాల‌నీలు
– న‌దుల‌ను త‌ల‌పించిన‌ దారులు – చేప‌లు పట్టిన జాల‌ర్లు
– స‌కాలంలో స్పందించిన ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు
– ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రావ‌ద్దంటు ప్ర‌భుత్వ విప్ గాంధీ పిలుపు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ‌త రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో శేరిలింగంప‌ల్లిని వ‌ర‌ద‌నీరు ముంచెత్తింది. లోత‌ట్టు ప్రాంతాల‌న్ని పూర్తిగా జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. గోపిచెరువు అలుగుకు గండి ప‌డ‌టంతో లింగంప‌ల్లి రైల్వే అండ‌ర్ బ్రిడ్జీ కింద‌నుంచి న‌దిని త‌ల‌పించేలా వ‌ర‌ద‌నీరు ఉప్పొంగింది. దీంతో లింగంప‌ల్లి, తారాన‌గ‌ర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అటు ప్ర‌కాష్ న‌గ‌ర్ కొత్త‌కుంటకు గండి ప‌డ‌టంతో మ‌దీన‌గుడ ప‌రిస‌ర ప్రాంతాల్లోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని డివిజ‌న్‌ల‌లో ఇదే ప‌రిస్థితి నెలకొంది. కాగా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, పోలీసులు స‌కాలంలో స్పందించ‌డంతో ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. కానుకుంట నాలాలో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి బైక్‌తో స‌హా నాలాలో కొట్టుకుపోయిన‌ట్టు బావించిన ఇద్ద‌రు వ్య‌క్తులు చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చి బైక్ మాత్ర‌మే వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిందని ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఐతే అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌ద్దని వారు పిలుపునిచ్చారు.

తారాన‌గ‌ర్ సాయిబాబా దేవాల‌యం వ‌ద్ద నివాసాల మ‌ధ్య‌లో నుంచి న‌దిని త‌ల‌పిస్తూ ఉదృతంగా పారుతున్న వ‌ర‌ద‌నీరు
మంజీరారోడ్డులోని జీ హాబీటాట్ అపార్ట్‌మెంట్లో సెల్లార్ ను పూర్తిగా ముంచెత్తి గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరిన వ‌ర‌ద‌నీరు. సెల్లార్‌లో 6 కార్లు, 20 బైక్‌లు ఉన్న‌ట్టు స‌మాచారం
శేరిలింగంప‌ల్లి జోన‌ల్ కార్యాల‌యం ఎదురుగా స‌గానికి పైగా నీట మునిగిన మీ సేవ కేంద్రం
జ‌వ‌హార్ కాల‌నీలోని ర‌హ‌దారుల్లో పార్కింగ్ చేసిన కార్లు వ‌ర‌ద‌నీటిలో మునిగిపోయిన దృశ్యం
తారాన‌గ‌ర్ మార్కెట్‌ను పూర్తిగా ముంచెత్తిన వ‌ర‌ద‌నీరు
దీప్తీశ్రీన‌గ‌ర్ ప్ర‌ధాన ర‌హ‌దారిలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నిండిపోయిన వ‌ర్ష‌పునీరు
న‌ల్ల‌గండ్ల గాంధీ ఎస్టేట్ వ‌ద్ద వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో శేరిలింగంప‌ల్లి ఉప‌క‌మిష‌న‌ర్ తేజావ‌త్ వెంక‌న్న‌
ఆల్విన్ కాల‌నీ డివిజ‌న్‌లో వ‌ర‌ద‌నీటిలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న ప్ర‌భుత్వ విప్ గాంధీ, జోన‌ల్ క‌మిష‌న‌ర్ మ‌మ‌త‌, కార్పొరేట‌ర్ దొడ్ల వెంక‌టేష్ గౌడ్‌
శేరిలింగంప‌ల్లి డివిజ‌న్‌ గోపిచెరువు వ‌ద్ద గండిప‌డిన అలుగును ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌, టీఆర్ఎస్ డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కింది ర‌వింద‌ర్ గౌడ్‌, గోపాల్ యాద‌వ్‌లు
మాదాపూర్ డివిజ‌న్ గోకుల్ ప్లాట్స్‌లో ముంపు ప్రాంతాన్ని ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌
కొండాపూర్ డివిజ‌న్ ప్రేమ్‌న‌గ‌ర్ బి బ్లాక్ వ‌ద్ద ముంపు ప్రాంతంలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here