అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయండి

  • శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలి
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ కు వినతి అందించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి అందిస్తున్న ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ కు కలిసి బొకే అందిస్తున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ని కలిసి వినతిపత్రాన్ని అందించారు. సంబంధిత అధికారులకు చేపట్టే అభివృద్ధి పనులపై పక్క ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా ఆదేశించాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ కు వినతిపత్రం ఇస్తున్న జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here