రహదారి భద్రతా, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు, జిహెచ్ఎంసి అధికారుల సమన్వయ సమావేశం

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ పరిధిలోని రహదారుల భద్రతా, ట్రాఫిక్ నియంత్రణపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. వెస్ట్ జోన్ కమీషనర్ రవికిరణ్, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్ ల ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమీషనరేటులో నిర్వహించిన ఈ సమావేశంలో చేపట్టవలసిన చర్యలపై పలు నిర్ణయాలను తీసుకున్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్, వెస్ట్ జోన్ కమీషనర్ రవికిరణ్ లు

రహదారులపై ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ దీపాలు, రోడ్ మార్కింగ్, ఫుట్ పాత్ ల ఏర్పాటు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, నీరు నిలిచే ప్రాతాల్లో చేపట్టాల్సిన చర్యలు, డ్రైనేజీ, వాటర్ లీకేజీలు తదితర సమస్యలపై చర్చించారు. సమయానుకూలంగా సమస్యలను పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ ట్రాఫిక్ ఎసిపి చంద్ర శేఖర్, ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాస్,గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహారావు, మియాపూర్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్, సీఆర్ఎంపి, ఎన్ సిసి జనరల్ మేనేజర్ శివ ప్రసాద్ లతో పాటు జలమండలి, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.

సమావేశం లో పాల్గొన్న ఇతర విభాగాల అధికారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here