ఊరి నడిబొడ్డులో మృగరాజుల హల్ చల్

నమస్తే శేరిలింగంపల్లి: జూ లో సింహాన్ని దగ్గరగా చూడాలంటేనే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటి మృగరాజు నడిరోడ్డుపై ఎదురు పడితే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయి. అయితే ఒక ఊరిలో అర్ధరాత్రి మృగరాజుల గుంపు తిరుగుతూ హల్చల్ చేసింది. దాదాపు నాలుగైదు సింహాలు అర్ధరాతి సమయంలో ఊరి మధ్యలో తిరుగుతుండగా ఒక వ్యక్తి తీసిన వీడియో సామజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. ఈ వీడియో నల్గొండ జిల్లా మునుగోడు మండలం లోని కల్వకుంట్ల గ్రామంలో తీసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారికంగా ప్రకటించిన సమాచారం లేదు. ఏదేమైనా సింహాలను అంత దగ్గరనుండి చూస్తూ వీడియో తీసిన వ్యక్తి ధైర్యాన్ని అభినందించాల్సిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here