కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తాం : కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఎల్లమ్మబండ బస్తీ సభ్యులు, అనేక బస్తి/కాలనీ సభ్యులు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. నల్లగండ్ల గ్రామంలోని ఆయన కార్యాలయంలో కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.

జగదీశ్వర్ గౌడ్ ని కలిసి పూల బొకే అందిస్తున్న ఎల్లమ్మ బండ తోపాటు పలు బస్తీల వాసులు

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలతోనే ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని పిలుపునిచ్చారు. తాము ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

జగదీశ్వర్ గౌడ్ సన్మానిస్తూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here