నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఎల్లమ్మబండ బస్తీ సభ్యులు, అనేక బస్తి/కాలనీ సభ్యులు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. నల్లగండ్ల గ్రామంలోని ఆయన కార్యాలయంలో కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-21-at-5.08.26-PM.jpeg)
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలతోనే ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని పిలుపునిచ్చారు. తాము ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-21-at-5.08.27-PM-1.jpeg)