నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో శేరిలింగంపల్లి లో బిజెపి నాయకుల రోడ్ షో లకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. బిజెపి ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, ఎంపీ ధర్మపురి అరవింద్ లు నియోజక వర్గం లో సోమవారం రోడ్ షో లో పాల్గొననున్నట్లు ఆ పార్టీ నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు.
సోమవారం సాయంత్రం 5 గం.లకు మాదాపూర్ హనుమాన్ మందిరం వద్దనుండి ప్రారంభమై, కొత్తగూడ జంక్షన్, హఫీజ్ పేట్ (ఆల్విన్ చౌరస్తా), మదీనాగూడ, చందానగర్ ల మీదుగా శేరిలింగంపల్లి తుల్జాభవాని దేవాలయం వరకు సాగనున్నట్లు తెలిపారు. అనంతరం 7 గం.లకు రోడ్ షో ముగింపు ప్రాంతంలో నేతలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ బిజెపి శ్రేణులు, ప్రజలు రోడ్ షో లో పాల్గొని విజయవంతం చేయాలనీ అయన పిలుపునిచ్చారు.