మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి అండగా ఉండేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే నాయకుడు పల్లె మురళి అని తిరంగా యూత్ అధ్యక్షుడు రోషన్ శర్మఅన్నారు. మియాపూర్ డివిజన్ ఎంసిపిఐ యు అభ్యర్థి పల్లె మురళికి మద్దతు తెలిపిన తిరంగా యూత్ నాయకులు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రోషన్ శర్మ మాట్లాడుతూ అనేక ప్రజా ఉద్యమాలలో సమస్యల పరిష్కారం కోసం మురళి పాటు పడ్డాడని, కరోనా కాలంలో సైతం చందాలు వసూలు చేసి పేద ప్రజల కడుపు నింపేందుకు తన శక్తికి మించి కృషి చేసాడని అన్నారు. డివిజన్ ప్రజలు సిలిండర్ గుర్తుకు ఓటు వేసి పల్లె మురళిని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సమీర్, ఫారిస్, ముఖిమ్ తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ డివిజన్ లో ఎంసిపిఐ యు ఎన్నికల ప్రచారం…

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎంసిపిఐ యు నాయకులు డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ, మియాపూర్, లక్ష్మి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ యు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.