హఫీజ్పేట (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నగరంలో తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించాలని హఫీజ్పేట, మాదాపూర్ డివిజన్ల తెరాస అభ్యర్థులు వి.పూజిత, జగదీశ్వర్ గౌడ్ లు అన్నారు. బుధవారం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఆదిత్య ఇంపీరియల్ హైట్స్ అపార్ట్మెంట్స్ వాసులతో వారు సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా పూజిత, జగదీశ్వర్ గౌడ్లు మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. డిసెంబర్ 1వ తేదీన జరగనున్న గ్రేటర్ ఎన్నికలలో ప్రజలందరూ కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గత ఐదేళ్లలో కళ్ల ముందు జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, బస్తీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.